శ్రీయుత గౌరవ నీయులైన మున్సిపల్ కమిషనగర్, కరీంనగర్ గారికి
విషయము : మా భూమిని కబ్జా చేసి ఇంటిని నిర్మించుకున్న వారిపై చర్యలు తీసుకొవడం గురించి
అయ్యా !
నా మనవి ఏమనగా నేను అనగా వేముల సరిత భర్త : కీ. శే. వేముల శ్రీనివాస్, నివాసం ధర్మపురి అను నేను తమరికి విన్నవించుకునేది ఏమనగా స్థానికి గాయత్రి నగర్ లోని సర్వే నెంబరు: 542లోని ప్లాట్ నెంబరు : 60, 60/ఏ రెండు ప్లాట్లను 2014లో నా భర్త కీ. శే. వేముల శ్రీనివాస్ కొనుగోలు చేసుకుని దస్తావేజు నెంబరు …/2014 ద్వారా రెజిస్ట్రేషను చేసుకోవడం జరిగింది. ఇట్టి స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జాచేసి గృహాన్ని నిర్మించుకుని దానికి ఇంటి నెంబరు- 1-5-510/30/A/1 తెచ్చుకున్నారు. దానిపై పలుమార్లు వారిని సంప్రదించగా వారు మీ స్థలానికి డబ్బులు చెల్లిస్తామని చెప్పి మాకు డబ్బులు ఇవ్వకుండా, మాకు తెలియకుండా వేరేవారికి అమ్మడానికి నిర్ణయించుకుని వారి వద్ద డబ్బులు తీసుకుని వారికీ రెజిస్ట్రేషను చేయడానికి సిద్ధం అయ్యారు. వారి వద్ద పైన తెలిపిన స్థలానికి సంబంధించిన గాని, ఇంటి నెంబరుకు గాని సంబంధించిన ఎలాంటి పేపర్లు లేవు వారు మా స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపట్టినారు, కావున తక్షణమే వారికీ జారీ చేసిన ఇంటి నెంబరును రద్దు చేసి మా స్థలాన్ని మాకు ఇప్పించగలరని మాయొక్క మనవి.
complaint…
Categories: